ఒకే ఫ్రేమ్ లో చిరు, మహేష్, ప్రభాస్, వైరల్ అవుతున్న ఫ్లాష్ బ్యాక్ ఫోటో

 ఒకే ఫ్రేమ్ లో చిరు, మహేష్, ప్రభాస్, వైరల్ అవుతున్న ఫ్లాష్ బ్యాక్ ఫోటో


హీరో సుమంత్ ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఫ్రైడే అంటూ ఆయన హీరో చిరంజీవి దర్శకుడు జయంత్ సి పరాంజీ కలిసివున్న, దాదాపు ఓ ఇరవై ఏళ్ల నాటి ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో మహేష్, ప్రభాస్, శ్రీకాంత్, తరుణ్, సుమంత్ లతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ కూడా ఉన్నారు. ఈ ఫోటో విశేషం ఏమిటంటే దర్శకుడు జయంత్ సి పరాన్జీ అక్కడ ఉన్న దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేశారు. చిరంజీవితో బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎం బి బి ఎస్ చిత్రాలు చేయడం జరిగింది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇక టక్కరి దొంగ చిత్రంలో మహేష్ ని కౌ బాయ్ గా ప్రజెంట్ చేశారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ని ఈశ్వర్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది జయంత్ సి పరాంజీ నే . ఐతే తరుణ్, సుమంత్ లతో ఆయన ఎటువంటి చిత్రం చేయలేదు. శంకర్ దాదా ఎం బి బి ఎస్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. సుమంత్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comments

Popular posts from this blog

ఖాజా టోల్ ప్లాజా దగ దగ్గర టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లను ఆపిన పోలీసులు